
ఇక ఈ చిత్రంలో ముమైత్ ఖాన్, నమిత లీడ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. దొంగ బాబాల భాగోతంపై ఈ సినిమా రూపొందించనున్నారట. ఇప్పటికే తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల ఆదరణ పొందిన పోసాని...ఈ చిత్రంలో నెగెటివ్ పాత్రతో పాటు, హీరో రోల్ లో కనిపించనున్నాడట. గత సంవత్సరం పోసారి దర్శకత్వం వహించిన ‘దుశ్శాసన’ చిత్రం ప్లాపు కావడంతో ఈ సంవత్సరం ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే నటుడిగా మాత్రం చాలా సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం పోసాని టింగరోడు చిత్రంలో హీరోగా..కృష్ణం వందే జగద్గురుమ్, అనుచరుడు, మిస్ చింతామణి తదితర చిత్రాల్లో సాధారణ పాత్రల్లో నటించబోతున్నాడు.